Homeటాప్ స్టోరీస్ఇండస్ట్రీలో 7 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్

ఇండస్ట్రీలో 7 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్

ఇండస్ట్రీలో 7 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్
ఇండస్ట్రీలో 7 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయింది. 2014లో తేజ్ అరంగేట్రం జరిగింది. తన మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం నవంబర్ 14న 2014లో విడుదలైంది. ఈ సందర్భంగా తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ ను షేర్ చేసాడు. “ఏడు సంవత్సరాల క్రితం ఈరోజు, నటుడు అవ్వాలన్న నా ప్యాషన్ నిజమైంది. నా మొదటి సినిమా నుండి నన్ను మీరు ఆదరించారు. నా అప్స్ అండ్ లోస్ లో నా తోడై ఉన్నావు. మీ ప్రేమకు ధన్యుడిని” అని ఎమోషనల్ పోస్ట్ వేసాడు. దీంతో పాటు ఒక స్పెషల్ ఎడిట్ వీడియోను కూడా షేర్ చేసాడు.

తేజ్ కెరీర్ లో మొదటగా విడుదలైన చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం అయినా కూడా మొదట మొదలుపెట్టింది రేయ్. అది వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ 7 ఏళ్లలో 14 సినిమాలను చేసాడు తేజ్. వీటిలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, ప్రతీ రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాలతో సక్సెస్ ను సాధించాడు.

- Advertisement -

తేజ్ కెరీర్ లో సుప్రీమ్ తర్వాత నుండి చిత్రలహరి వరకూ డల్ ఫేజ్ నడిచింది. వరసగా ఆరు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే దానితర్వాత మూడు సక్సెస్ లతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు.  ప్రస్తుతం రోడ్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న తేజ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.

Also Read:

రిపబ్లిక్ సినిమాకు రేవంత్ రెడ్డి ప్రశంసలు..!

కోమాలో సాయి ధరం తేజ్.. షాక్ లో మెగా ఫ్యాన్స్..!

రిపబ్లిక్ ఈవెంట్ : సన్నాసుల్లారా.. వెధవల్లారా..!

నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం; ఈరోజు కూడా ఐసీయూలోనే!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All