ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ వారం రెండు బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘డంకీ’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాగా, దీనికి మంచి టాక్ దక్కింది. కానీ, రాజ్ కుమార్ హిరాణీ సినిమాలకు వచ్చే రిజల్ట్ ఈ సినిమాకు రాకపోవచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు.
దీంతో ఈ వీకెండ్ సలార్ మూవీకి రూట్ క్లియర్ అయినట్లే అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కేజీయఫ్ లాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో ‘సలార్’పై ఉత్తరాదిన కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ప్రభాస్కు నార్త్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో సలార్ మూవీకి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డు కలెక్షన్స్ వస్తాయా అని బాలీవుడ్ వర్గాలు సైతం ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు ఉత్తరాది ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ఈ సినిమా ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రుతి హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.