Homeగాసిప్స్మరోసారి హరిహర వీరమల్లు టీం కు పవన్ షాక్ ఇవ్వబోతున్నాడా..?

మరోసారి హరిహర వీరమల్లు టీం కు పవన్ షాక్ ఇవ్వబోతున్నాడా..?

Team Hari Hara Veera Mallu conducted pooja on the auspicious occasion of Sri Rama Navami
Team Hari Hara Veera Mallu conducted pooja on the auspicious occasion of Sri Rama Navami

వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 50 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలనీ పవన్ ఫిక్స్ అయ్యాడు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది. ఐదు నెలల పాటు ఈ చిత్ర షూటింగ్ లోనే పాల్గొనాలని..మరో మూవీ షూటింగ్ లో పాల్గొనకూడదని అనుకున్నారు.

కానీ అనూహ్యంగా పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్ చేస్తూనే మరో రెండు రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వీటిని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. ఇందు కోసం ‘హరి హర వీరమల్లు’ కు జూలై నుంచి బ్రేక్ ఇవ్వబోతున్నారట. అంటే జూలై ఎండ్ వరకు కంప్లీట్ చేసి ఆ తరువాత తమిళ సూపర్ హిట్ చిత్రాల రీమేక్ లలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన చిత్రం ‘వినోదాయ సితం’. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని పవన్ తో తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

- Advertisement -

ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. అంతే కాకుండా తెలుగు నేటీ విటీకి అనుగుణంగా కథలో మార్పులు కూడా చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించనున్నీ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నాడు. జీ స్టూడియోస్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మూవీని త్వరలోనే ప్రారంభించబోతున్నారట. అంతే కాకుండా ఈ మూవీతో పాటు విజయ్ హీరోగా నటించిన ‘థేరీ’ ని కూడా రీమేక్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చి పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All