Homeగాసిప్స్బాలయ్యతో ప్రశాంత్.. తేడా కొడితే..?

బాలయ్యతో ప్రశాంత్.. తేడా కొడితే..?

What If Prashant Varma Movie With Balakrishna Disappoints

నందమూరి బాలకృష్ణ ఇటీవల వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్ అందుకుంటున్నాడు. వరుసగా యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశాలు ఇస్తూ బాలయ్య వారితో పాటు ఆయన కూడా విజయాలను అందుకుంటున్నాడు. రీసెంట్‌గా దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని మరో యంగ్ డైరెక్టర్ బాబీతో చేయనున్నాడు. కాగా, ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

దీనికి సంబంధించిన క్లారిటీని దర్శకుడు ప్రశాంత్ వర్మ స్వయంగా ఇచ్చాడు. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘హనుమాన్’ మూవీ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఆద్యంతం అదిరిపోయే గ్రాఫిక్స్, విజువల్స్‌తో హనుమాన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్యతో టాలీవుడ్‌లో ఇప్పటివరకు రాని ఓ సరికొత్త జోనర్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. భైరవద్వీపం, ఆదిత్య 369 చిత్రాల స్ఫూర్తితో తాను బాలయ్యతో ఓ నెవర్ బిఫోర్ ట్రెండ్ సెట్టింగ్ మూవీని చేయబోతున్నట్లు తెలిపాడు. అయితే, ఈ సినిమాపై ప్రశాంత్ వర్మ అప్పుడే ఈ రేంజ్‌లో కాన్ఫిడెన్స్ చూపిస్తుండటంతో ఇప్పుడు సినీ వర్గాల్లో దీనికి సంబంధించి తెగ చర్చ సాగుతోంది.

ప్రశాంత్ వర్మ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు పెట్టింది పేరు. నిజంగా బాలయ్య కోసం ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమా ఇదే కోవలోకి వస్తే, ఆ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరిగిరాయడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. కానీ, ఏదైనా తేడా కొడితే మాత్రం, ఇంతకాలంగా ప్రశాంత్ వర్మ సాధించిన పేరు ఒక్క సినిమాతో పూర్తిగా మాయం అవుతుందని వారు అంటున్నారు. మరి బాలయ్యతో ప్రశాంత్ వర్మ సినిమా నిజంగానే రికార్డులను తిరగరాసే మూవీగా ఉండబోతుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All