
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో ఈ నెల 23 న యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేయబోతున్నారు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటనను తెలియజేసారు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చ గా మారింది.
ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ , రాజమౌళి పేర్లు వినిపించాయి. ఇక నిన్న ఎన్టీఆర్ పేరు వినిపించింది. ఇక ఈరోజు మహేష్ బాబు పేరు వినిపిస్తుంది. దీంతో అసలు ఎవరు వస్తారనేది అర్థంకాక అభిమానులు అయోమయం అవుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తే ఫుల్ స్టాప్ పడుతుంది.
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ భారీ మూవీని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మించారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారికగా ఓ దశలో చరణ్ తో కలిసి నక్సలైట్ గా నూ కనిపించబోతున్నారు. ధర్మస్థలి కోసం వీరు ఏం చేశారు? .. చరణ్ కిచ్చినన మాట కోసం ఆచార్యుడు ఏం చేశాడు? ధర్మస్థలికి అండగా ఎలా నిలిచాడనే కథా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తుంది .