మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా దేవా కట్ట డైరక్షన్ లో వచ్చిన సినిమా రిపబ్లిక్. శుక్రవరం రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సమాజాన్ని వేలెత్తి చూపించే కథ, కథనాలతో దేవా కట్ట ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రిపబ్లిక్ సినిమా చూసిన టీడీపీ జాతీయ ప్రతినిధి నారా లోకేష్ సినిమా బాగుందని ట్వీట్ చేశారు. లేటెస్ట్ గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రిపబ్లిక్ సినిమా సూపర్ అనేశారు. ఆదివారం సాయంత్రం రేవంత్ రెడ్డి, ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఏ.ఎం.బి సినిమాస్ లో రిపబ్లిక్ సినిమా ప్రత్యేక స్క్రీనింగ్ లో చూశారు. రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరూ సినిమా చూసి చిత్రయూనిట్ ను ప్రశంసించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో దేవా కట్ట, సింగర్ స్మిత కూడా పాల్గొన్నారు.