Homeటాప్ స్టోరీస్హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు సెప్టెంబర్ 10వ తారీఖున హైదరాబాద్ లో బైక్ పైన వెళ్తుంటే  యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతోన్న విషయం తెల్సిందే. కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో పాటు స్వల్ప గాయాలు అయ్యాయి. కాలర్ బోన్ ను ఆపరేట్ చేసిన వైద్యులు తేజ్ కు విశ్రాంతిని ప్రకటించారు.

అప్పటినుండి హాస్పిటల్ లోనే ఉన్న తేజ్, ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ కు అనుమతిచ్చారు. అయితే తేజ్ మరో 3-4 నెలలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాడని తెలుస్తోంది. దాని తర్వాతే తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టనున్నాడు.

- Advertisement -

తేజ్ హాస్పిటల్ లో ఉండగానే తను నటించిన రిపబ్లిక్ విడుదలైన విషయం తెల్సిందే. తేజ్ కు ఈ సినిమా ద్వారా చాలా మంచి పేరొచ్చింది. దేవా కట్టా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోని సినిమా అందరినీ మెప్పించింది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ ను చేస్తున్నాడు. సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ్ యాక్సిడెంట్ కు గురి కావడంతో ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All