యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న దురదృష్టవశాత్తూ రోడ్ యాక్సిడెంట్ ను గురైన విషయం తెల్సిందే. స్పోర్ట్స్ బైక్ పై వెళుతోన్న తేజ్, రోడ్ పై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తేజ్ ను తీసుకెళ్లగా అక్కడినుండి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు.
నిన్ననే తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని మెగా నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో తెలిపారు. ఆ తర్వాత వచ్చిన హెల్త్ బులిటెన్ కూడా అదే ధృవీకరించింది. ఇక ఈరోజు ఉదయం వచ్చిన మరో హెల్త్ బులెటిన్ మెగా ఫ్యాన్స్ కు ఊరటనిచ్చింది. బోన్ ఫ్రాక్చర్ తప్పితే తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని, ఎక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వలేదని అపోలో హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు.
అయితే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తేజ్ ను మరో రోజు ఐసీయూలోనే ఉంచుతామని అన్నారు. రేపు జనరల్ వర్డ్ కు షిఫ్ట్ చేస్తామని, రేపు ఉదయం మరో హెల్త్ బులిటెన్ విడుదలవుతుందని అప్డేట్ ఇచ్చారు. మరోవైపు మెగా హీరోలతో పాటు ప్రముఖ నటీనటులు కూడా అపోలో ఆసుపత్రికి వచ్చి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.