Homeటాప్ స్టోరీస్థాంక్యూ కలెక్టర్ కథల సిరీస్ ను మొదలుపెట్టిన సాయి ధరమ్ తేజ్

థాంక్యూ కలెక్టర్ కథల సిరీస్ ను మొదలుపెట్టిన సాయి ధరమ్ తేజ్

థాంక్యూ కలెక్టర్ కథల సిరీస్ ను మొదలుపెట్టిన సాయి ధరమ్ తేజ్
థాంక్యూ కలెక్టర్ కథల సిరీస్ ను మొదలుపెట్టిన సాయి ధరమ్ తేజ్

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నుండి వస్తోన్న తాజా చిత్రం రిపబ్లిక్. అక్టోబర్ 1న మహాత్మా గాంధీ జన్మదిన వీకెండ్ సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వంవహించాడు. రిపబ్లిక్ లో కలెక్టర్ పంజా అభిరాం పాత్రను పోషించాడు సాయి ధరమ్ తేజ్.

సినిమాలో కలెక్టర్ పాత్ర కావడంతో ఆ దిశగా ప్రమోషన్స్ ను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 8 నుండి మొదలుపెట్టి థాంక్యూ కలెక్టర్ పేరిట మనల్ని ఇన్స్పైర్ చేసిన కలెక్టర్ ల కథలను మన ముందుకు తీసుకురానున్నారు. “సరిహద్దులో నిల్చుని మన దేశ సరిహద్దును కాపాడే సైనికుడు అంటే మనకెంతో గౌరవం. వాళ్ళ వీర గాథలు ఎన్నో విన్నాం, చూసాం.

- Advertisement -

కానీ దేశ సరిహద్దు లోపల స్వదేశీ శత్రువులు మన వ్యవస్థ మీద చేసే అన్యాయాల దాడి నుండి దేశానికి కాపాడటానికి ప్రతీ రోజూ కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారు. అలా పోరాడుతూ జయించినవాళ్ళూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. అలాంటి బ్రేవ్ కలెక్టర్లను గుర్తించి థాంక్యూ కలెక్టర్ ఇనిషియేటివ్ ద్వారా వారి కథలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం” అని సాయి ధరమ్ తేజ్ ఒక వీడియోలో తెలియజేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All