పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ చేస్తోన్న భీమ్లా నాయక్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నామని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు సాంగ్స్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. త్వరలోనే టీజర్ విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ చివరి దశకు చేరుకోవడంతో పవన్ కళ్యాణ్ తన తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెంచుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు తిరిగి మొదలుపెట్టాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ కు బ్రేకులు పడ్డ హరిహర వీర మల్లును తిరిగి స్టార్ట్ చేయాల్సి ఉంది. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కు కూడా లైన్లో పెట్టనున్నాడు.
అయితే ఈ రెండు సినిమాలను సమాంతరంగా షూటింగ్ చేయాలా లేక హరిహర వీర మల్లు పూర్తి చేసాక పూర్తిగా భగత్ సింగ్ చిత్రానికి ఫోకస్ ఇవ్వాలా అన్న కన్ఫ్యూజన్ లో పవన్ ఉన్నాడు. ప్రస్తుతానికైతే డిసెంబర్ లో భవదీయుడు భగత్ సింగ్ ఒక షార్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నటీనటుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఇవి కూడా చదవండి:
భవదీయుడు.. సరైన ట్రాక్ లోనే ఉన్నాడు: హరీష్ శంకర్
భవదీయుడు భగత్ సింగ్ భామ కన్ఫర్మ్ అయింది!
పవన్ కళ్యాణ్ ఇక భవదీయుడు భగత్ సింగ్