నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో రూపొందిస్తోన్న సినిమా బింబిసార. అతి క్రూరుడైన రాజు బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రం ఇది. కొత్త దర్శకుడు వశిస్థ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. అత్యద్భుతమైన విజువల్స్ ఈ టీజర్ లో దర్శనమిచ్చాయి. అలాగే నిర్మాణ విలువలు కూడా అదిరిపోయాయి. ప్రతీ ఫ్రేమ్ లో కూడా ఆ రిచ్ నెస్, ఆ రాజసం కనిపిస్తుంది.
టీజర్ లో పవర్ఫుల్ గా బింబిసారను చూపించారు. ఇక టీజర్ లో పెట్టిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. ‘‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసులైతే.
ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది’’ ఈ డైలాగ్ వెంటనే కనెక్ట్ అవుతుంది. ఇక టీజర్ లో అప్పటి రాజుల కాలం మాత్రమే కాకుండా సమాంతర కాలాన్ని కూడా చూపించి ఆసక్తి కలిగేలా చేసారు. ఈ చిత్రంలో క్యాథెరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.
ఇవి కూడా చదవండి:
నందమూరి కళ్యాణ్ రామ్ ఏమైపోయాడు?
నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాను అలా వదిలేశారేంటి?
కళ్యాణ్ రామ్ సినిమాకు బలమైన సాంకేతిక వర్గం!!