నందమూరి ఫ్యామిలీకి అల్లు కుటుంబం దగ్గరవుతోంది. అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహాలో నందమూరి బాలకృష్ణ ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే. అన్ స్టాపబుల్ పేరుతో కొనసాగుతోన్న ఈ టాక్ షో ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి ఎపిసోడ్ కు మోహన్ బాబు గెస్ట్ గా రాగా రెండో ఎపిసోడ్ లో నాని సందడి చేసాడు. మూడో ఎపిసోడ్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఇక్కడితో వీళ్ళ బాండింగ్ ఆగిపోలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్య సినిమా చేస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక నిన్న అన్నిటికంటే సర్ప్రైజింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే బాలయ్య నటించిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రావడం. బాలయ్య సినిమా ఈవెంట్ కు బన్నీ చీఫ్ గెస్ట్ అంటే వినడానికే కొత్తగా ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య బాండింగ్ సరికొత్తగా, ఫ్యాన్స్ కు రిఫ్రెషింగ్ గా ఉంది.
నవంబర్ 27న శిల్పకళా వేదికలో ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు స్టార్స్ ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకుంటారన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఇవి కూడా చదవండి:
పుష్ప ట్రైలర్ డైలాగ్స్ దద్దరిల్లిపోవాల్సిందే..!
ఏ బిడ్డా ఇది నా (రికార్డుల)అడ్డా.. ‘పుష్ప’ రాజ్ పాట నాటు.. వేట ఊర నాటు..!
అల్లు అర్జున్ కు టిఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు..!