మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు ఉడుగుల, రానా దగ్గుబాటి హీరోగా రూపొందించిన చిత్రం విరాటపర్వం. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అసలైతే ఈ ఏడాది సమ్మర్ లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత చిత్ర రిలీజ్ ను వాయిదా వేశారు.
గత కొన్ని రోజులుగా విరాటపర్వం విడుదలపై పలు వార్తలు షికార్లు చేసాయి. నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మరో చిత్రం దృశ్యం 2 కూడా ఓటిటిలో విడుదలవ్వనుండడంతో అందరూ నిజమే అనుకున్నారు. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
విరాటపర్వం ఓటిటికి వచ్చే ముందు కచ్చితంగా థియేటర్లలో విడుదలవుతుందని తెలుస్తోంది. అయితే విడుదల తేదీ ఎప్పుడన్నది క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై అందరూ చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఒక్కసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితే ప్రమోషన్స్ ను షురూ చేస్తారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తిగా కనిపిస్తాడు.
ఇవి కూడా చదవండి:
విరాటపర్వం డిజిటల్ డీల్ లాక్ అయినట్లేనా?
`ఫిదా`లో చేయమంటే ఆ ఇద్దరు కాదన్నారా?
`విరాటపర్వం` రెడ్ సెల్యూట్ టు ఉమెన్స్!
సాయి పల్లవి ఎకె రీమేక్ నుండి తప్పకుందా?