రానా దగ్గుబాటి హీరోగా నటించిన విరాటపర్వం షూటింగ్ ను లాక్ డౌన్ కు ముందే ముగించుకుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా ఈ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ గురించి గతంలో వార్తలు వచ్చాయి కానీ నిర్మాతలు వాటిని ఖండించారు.
అయితే మరోసారి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయ్. నారప్ప, మేస్ట్రో డిజిటల్ రిలీజ్ విషయంలో కూడా నిర్మాతలు ముందు థియేట్రికల్ రిలీజ్ అనే అన్నా నిర్ణయం మార్చుకున్నారు. ఇదే కోవలో విరాటపర్వం ఓటిటి రిలీజ్ విషయంలో జరిగిందని అంటున్నారు.
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తో విరాటపర్వం డిజిటల్ రైట్స్ విషయంలో చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే విరాటపర్వం విడుదలకు సంబంధించిన అప్డేట్ బయటకు వస్తుంది. ప్రోమోలతో ఆకట్టుకున్న విరాటపర్వం విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనని ఆసక్తి అందరిలో ఉంది.