సాయి పల్లవి… ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే మాట. అంతగా పాపులర్ అయిపోయింది. ఆడియన్స్లోనే కాదు మేకర్స్ కూడా సాయి పల్లవి నామ జపం చేస్తున్నారు. `విరాట పర్వం` చిత్రంలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సాయి పల్లవిపై చిత్రీకరించిన `కోలు కోలు .. అంటూ సాగే లిరికల్ వీడియోని ఇటీవల విడుదల చేశారు. ఈ పాట చార్ట్బస్టర్గా మారింది.
ఇదే ఊపులో సాయి పల్లవి నటిస్తున్న మరో చిత్రం `లవ్ స్టోరీ` నుంచి `సారంగ దరియా`… అంటూ సాగే లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఇదిలా వుంటే సాయి పల్లవి ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న ` అయ్యప్పనమ్ కోషియుం` రీమేక్లో నటించడానికి అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం ఆమె డేట్స్ అందుబాటులో లేనందున ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని తెలుస్తోంది. సాయి పల్లవి స్థానంలో మేకర్స్ మరో ఇద్దరు నటీమణులతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ మల్టీస్టారర్లో రానా మరో హీరోగా నటిస్తున్నారు.