లాక్డౌన్ కారణంగా అన్ని చిత్రాలకు సంబంధించిన షూటింగ్లు మథ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఇటీవల ఆగిపోయిన చిత్రాలన్నీ మళ్లీ మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న `విరాటపర్వం` షూటింగ్ తాజాగా పునః ప్రారంభమైంది. `నీది నాది ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేష్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఓ షెడ్యూల్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బ్యాలెన్స్గా వున్న షూటింగ్ని ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. నైట్ షూటింగ్స్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో రానా కూడా పాల్గొంటున్నారు. ఉత్తర తెలంగాణ నేపథ్యంలో నక్సలిజం చుట్టూ అల్లుకున్న కథగా ఈ మూవీ వుంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు కనిపించని పాత్రల్లో రానా, సాయి పల్లవి నటిస్తున్నారు. ఫోక్ సింగర్గా సాయిపల్లవి పాత్ర కొత్తగా వుంటుందని ఇన్సైడ్ టాక్. కథే ప్రధాన హీరోగా ఈ మూవీ సాగుతుందని ఇటీవల విడుదల చేసిన పాత్రలని బట్టి తెలుస్తోంది. ప్రియమణి, నందితాదాస్, నవీన్చంద్ర, జరీనా వాహెబ్, ఈశ్వరీరావు, సాయిచంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బులి సంగీతం, డానీ సాంచెజ్ లోపెజ్ ఛాయాగ్రహణం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.