![సాయి పల్లవిని ధనుష్ అండ్ కో అమానించారా? సాయి పల్లవిని ధనుష్ అండ్ కో అమానించారా?](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/11/Dhanush-insulted-to-Sai-pallavi.jpg)
ధనుష్, సాయి పల్లవి కలిసి నటించిన తమిళ చిత్రం `మారి 2`. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఇందులో ప్రభుదేవా కంపోజ్ చేసిన `రౌడీ బేబీ..` సాంగ్ మాత్రం సంచలనం సృష్టిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్లో 1 బిలియన్ వ్యూస్ని దాటి యూట్యూబ్లో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
ప్రభుదేవా నృత్యరీతులకు ఈ పాటలో మరింత గ్రేస్ని ధనుష్, సాయి పల్లవి యాడ్ చేయడం వల్లే ఈ ఫీట్ సాధ్యమైందన్నది అందరికి తెలిసిందే. ధనుష్తో పోటీపడి మరీ సాయి పల్లవి తనదైన గ్రేస్తో పాటకి వన్నెతెచ్చింది. వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని హీరో ధనుష్ నటించి నిర్మించాడు. రౌడీ బేబీ 1 బిలిమన్ వ్యూస్ని క్రాస్ చేసిన సందరర్భంగా వండర్బార్ ఫిల్మ్స్ సంస్థ సీడీపీని రిలీజ్ చేసింది.
అయితే ఇందులో ధనుష్ మాత్రమే వుండటంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ధనుష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో సాయి పల్లవి ఎఫర్ట్ ఎంతో వుందని దాన్ని గుర్తించకుండా సీడీపీలో కేవలం ధనుష్ ఫొటోని మాత్రమే పెట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జరిగిన తప్పుని సరిదిద్దుకుని సీడీపీలో సాయి పల్లవి ఫోటోని పెట్టాలని ఆమె ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ధనుష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.