Homeటాప్ స్టోరీస్ఆసుప‌త్రిలో చేరిన రాక్‌లైన్ వెంక‌టేష్‌!

ఆసుప‌త్రిలో చేరిన రాక్‌లైన్ వెంక‌టేష్‌!

ఆసుప‌త్రిలో చేరిన రాక్‌లైన్ వెంక‌టేష్‌!
ఆసుప‌త్రిలో చేరిన రాక్‌లైన్ వెంక‌టేష్‌!

క‌న్న‌డ నిర్మాత, న‌టుడు రాక్‌లైన్ వెంక‌టేష్ బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరారు. క‌రోనా ల‌క్ష‌ణాలు వుండ‌టంతో ఆయ‌న త‌న త‌న‌యుడు ప‌నిచేస్తున్న ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు తెలిసింది. ఆయ‌న త‌న‌యుడు అభిలాష్ డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌నే తండ్రి రాక్‌లైన్ వెంక‌టేష్ వైద్యం చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని, ఆయ‌న ఆరోగ్యం స్టేబుల్‌గానే వుంద‌ని క‌న్న‌డ వ‌ర్గాలు అంటున్నాయి.

క‌న్న‌డ‌లో రాక్‌లైన్ వెంక‌టేష్‌కు తెలుగు నిర్మాత దిల్ రాజు త‌ర‌హాలో మంచి పేరుంది. ఇటీవ‌ల మండ్య ఎంపీ, న‌టి సుమ‌ల‌త‌తో క‌లిసి క‌న్న‌డ సూప‌ర్ స్టార్ అంబ‌రీష్ మెమోరియ‌ల్ ఏర్పాటు కోసం క‌ర్ణాటక ముఖ్య‌మంత్రి యాడ్యూర‌ప్పాని క‌లిసి చ‌ర్చించార‌ట‌‌. ఆ త‌రువాతే న‌టి, ఎంపీ సుమ‌ల‌త‌కు క‌రోనా సోకిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. టెస్టుల్లో పాజిటివ్ అని తేల‌డంతో సుమ‌ల‌త డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు స్వీయ నిర్భఃధంలోకి వెళ్లిపోయారు.

- Advertisement -

ఆమెతో క‌లిసి సీఎంని క‌లిసిన రాక్‌లైన్ వెంక‌టేష్‌కు క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే రాక్‌లైన్ వెంక‌టేష్‌ని టెస్ట్ చేసిన డాక్ట‌ర్లు క‌రోనా సోకిన‌ట్టు నిర్థార‌ణ‌కు రాలేద‌ని తెలిసింది. విక్ర‌మ్‌తో మ‌జా, ర‌జ‌నీకాంత్ తో లింగా, ఉపేంద్ర‌తో సూప‌ర్, ప‌వ‌ర్‌, బ‌‌జ‌రంగీ భాయిజాయ్ కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌‌ వంటి చిత్రాల్ని ‌రాక్‌లైన్ వెంకేష్ అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All