Homeటాప్ స్టోరీస్క‌రోనాతో యంగ్ హీరో తండ్రి మృతి!

క‌రోనాతో యంగ్ హీరో తండ్రి మృతి!

క‌రోనాతో యంగ్ హీరో తండ్రి మృతి!
క‌రోనాతో యంగ్ హీరో తండ్రి మృతి!

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విల‌యాన్ని సృష్టిస్తోంది. లాక్‌డౌన్ స‌డ‌లించిన ద‌గ్గ‌రి నుంచి దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు ప్ర‌మాద స్థాయిలో పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌మాద స్థాయికి చేరుకుంది. రోజు రోజుకీ వేల‌ల్లో కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. జ‌నం ఎప్పుడు ఎవ‌రిని క‌రోనా కాటేస్తుందా అని భ‌యం భ‌యంగా కాలం వెళ్ల‌‌దీస్తున్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మాత్రం క‌రోనా భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ఈ రంగంలోని కొంద‌రికి సోకింది కూడా.

కొంత మందిని బ‌లి తీసుకుంది కూడా. ఇటీవ‌ల ఈత‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోద‌రుడు పోకూరి రామారావు క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ వార్త మ‌ర్చిపోక‌ముందే సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో వ్య‌క్తి మ‌ర‌ణించ‌డం షాక్ కు గురిచేస్తోంది. య‌వ హీరో `ఈ రోజుల్లో` ఫేమ్ శ్రీ తండ్రి వెంక‌ట దుర్గా రామ్‌ప్రాద్ క‌రోనా సోకి మృతి చెందారు.

- Advertisement -

గ‌త 20 రోజుల‌గా తీవ్ర అనారోగ్యంతో విజ‌య‌వాడ‌లోని ఓ ప్ర‌ముఖ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న  బుధ‌వారం రాత్రి 8:30 గంట‌ల‌కు తుది శ్వాస విడిచారు.  దీంతో హీరో శ్రీ‌, అత‌ని కుటుంబ స‌భ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All