టాలీవుడ్లో నిర్మాత దిల్ రాజుకు ప్రత్యేక గుర్తింపు వున్న విషయం తెలిసిందే. అర్థవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన దిల్ రాజు నిర్మాతగా తన కెరీర్లో ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నారు. నిర్మాతగా బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకున్న ఆయన లాక్డౌన్ వేళ రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మొదటి భార్య అనిత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తరువాత నుంచి ఒంటరిగానే వుంటున్న దిల్ రాజు తన కూతురు బలవంతం వల్ల వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఫిట్ నెస్పై ఆసక్తిని చూపించని దిల్ రాజు తాజాగా తన పంథాను మార్చుకున్నట్టు తెలుస్తోంది. వైఘా రెడ్డి వచ్చాక ఆయన అలవాట్లు, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.
తాజాగా దిల్ రాజు ఫిట్నెస్పై దృష్టిపెట్టారు. తన భార్య వైఘా రెడ్డితో కలిసి డైలీ బ్యాడ్మింటన్ ఆడుతున్నారాయన. తాజాగా దీనికి సంబంధించిన ఓ సెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డైలీ జిమ్లో వర్కవుట్లు చేస్తూ భార్యతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.