భాగ్యశ్రీ గుర్తుందా? బాలీవుడ్ సూపర్ హిట్ క్లాసికల్ ఫిల్మ్ మైనే ప్యార్ కియా చిత్రంలో హీరోయిన్ గా చేసిన భాగ్యశ్రీ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెల్సిందే. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ లో భాగ్యశ్రీ నటించింది. ప్రభాస్ తల్లి పాత్రను పోషించింది. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం ఛత్రపతి రీమేక్ లో కూడా భాగ్యశ్రీ నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు భాగ్యశ్రీ కూతురు అవంతిక డెబ్యూ చేస్తోంది. ఆమె తొలి సినిమా తెలుగులో చేయనుండడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నాంది ఫేమ్ సతీష్ వేగేశ్న ప్రొడక్షన్ లో సినిమా చేయనున్నాడు బెల్లంకొండ గణేష్. ఈ చిత్రంలో హీరోయిన్ గా అవంతిక నటించనుంది.
ఇప్పటికే భాగ్యశ్రీను కలిసిన నిర్మాతలు ఆమె నుండి ఆమోదాన్ని పొందారు. తల్లి దారిలోనే కూతురు అవంతిక కూడా సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
Also Read:
మహేష్కు తల్లిగా బాలీవుడ్ నటి?
భాగ్యశ్రీ మళ్లీ స్పీడు పెంచారుగా!
ప్రభాస్ కోసం ఆమెని దించేస్తున్నారుగా!