మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన యాత్ర చిత్రం ఎట్టకేలకు పెట్టిన పెట్టుబడిని సాధించిపెట్టింది నిర్మాతలకు . మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ , జగపతి బాబు , సుహాసిని , రావు రమేష్ , పోసాని , ఆశ్రిత వేముగంటి తదితరులు నటించారు . ఫిబ్రవరి 8 న రిలీజ్ అయిన యాత్ర కు ప్రేక్షకుల నీరాజనాలు లభించాయి దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో 8.81 కోట్ల షేర్ రాబట్టింది . అలాగే డిజిటల్ రైట్స్ రూపంలో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు రాబట్టింది .
ఏరియాల వారీగా యాత్ర వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 1. 55 కోట్లు
సీడెడ్ – 1. 61 కోట్లు
వైజాగ్ – 57 లక్షలు
గుంటూరు – 1. 12 కోట్లు
కృష్ణా – 61 లక్షలు
ఈస్ట్ – 32 లక్షలు
వెస్ట్ – 42 లక్షలు
నెల్లూర్ – 41 లక్షలు
కేరళ – 70 లక్షలు
ఓవర్ సీస్ – 95 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 55 లక్షలు
మొత్తం – 8. 81 కోట్లు
వీటికి అదనంగా డిజిటల్ రైట్స్ రూపంలో – 8 కోట్లు
English Title : Yatra Worldwide Box Office Collections