మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన చిత్రం యాత్ర . 2003 లో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 8 న రిలీజ్ అయి మంచి వసూళ్ల ని రాబడుతోంది . అలాగే మంచి పేరు కూడా తీసుకొచ్చింది దర్శక నిర్మాతలకు . మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాత్ర ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో దాదాపు 6 కోట్ల షేర్ రాబట్టింది . దాంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . వీటికి తోడు డిజిటల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ రూపంలో మరింత సొమ్ము అందనుంది .
ఏరియాల వారీగా యాత్ర 5 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 80 లక్షలు
సీడెడ్ – 1. 20 కోట్లు
ఉత్తరాంధ్ర – 38 లక్షలు
ఈస్ట్ – 25 లక్షలు
వెస్ట్ – 35 లక్షలు
కృష్ణా – 48 లక్షలు
గుంటూరు – 96 లక్షలు
నెల్లూరు – 33 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 42 లక్షలు
ఓవర్ సీస్ – 75 లక్షలు
మొత్తం – 5. 92 కోట్లు
English Title: Yatra five Days Worldwide Collections