గీత గోవిందం చిత్రంలో నటించిన రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది దాంతో మళ్ళీ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో ఈ డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల కానుంది . ఇక ఓ ప్రముఖ ఛానల్ వేడుకలు విజయనగరం లో జరుగగా ఈ జంట ఆ వేడుకలో పాల్గొన్నారు . అంతేకాదు అదే వేడుకలో పబ్లిగ్గా అందరి ముందు రష్మిక ని ముద్దాడి సంచలనం సృష్టించాడు విజయ్ దేవరకొండ .
విజయ్ దేవరకొండ కౌగిలింత ఇచ్చి ముద్దాడటంతో సిగ్గుల మొగ్గ అయ్యింది రష్మిక మందన్న . ఇక వీళ్ళిద్దరిని చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న అనుమానం కూడా నెలకొంది . విజయ్ దేవరకొండ అంటే ఈ భామకు కూడా బాగా ఇష్టమే అనుకుంటా అందుకే కళ్ళతోనే తన అభిమానాన్ని చాటింది . గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాగా డియర్ కామ్రేడ్ మాత్రం జూలై 26 న నాలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది .