Homeన్యూస్వారం రోజుల్లో గుడ్ న్యూస్ రాబోతుంది - టికెట్స్ ధరలపై కమిటీ చెపుతున్న మాట

వారం రోజుల్లో గుడ్ న్యూస్ రాబోతుంది – టికెట్స్ ధరలపై కమిటీ చెపుతున్న మాట

వారం రోజుల్లో గుడ్ న్యూస్ రాబోతుంది - టికెట్స్ ధరలపై కమిటీ చెపుతున్న మాట
వారం రోజుల్లో గుడ్ న్యూస్ రాబోతుంది – టికెట్స్ ధరలపై కమిటీ చెపుతున్న మాట

ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఫై ప్రభుత్వం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సమావేశం ఈరోజు గురువారం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఓ గుడ్ న్యూస్ రాబోతుందని అంత భావించారు కానీ కమిటీ మాత్రం మరో వారం రోజుల్లో గుడ్ న్యూస్ రాబోతుందని తెలిపారు. గతంలో పెట్టిన ప్రతిపాదనల్నే.. కమిటీ ముందు ఉంచామనీ… అన్నీ చర్చించి కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

అలాగే రీసెంట్ గా సినీ పెద్దలు చిరంజీవి , మహేష్ బాబు , ప్రభాస్ , రాజమౌళి , కొరటాల శివ తదితరులు జగన్ తో భేటీ అయ్యి..పలు అంశాల గురించి మాట్లాడారు. ఈరోజు సమావేశంలో కూడా వారు ప్రతిపాదించిన అంశాల గురించి సమావేశంలో చర్చించుకున్నామని కమిటీ తెలిపింది. ఈ గుడ్ న్యూస్ ఫిబ్రవరి 25 లోపు వస్తే భీమ్లా నాయక్ కు ఎంతో మేలు జరుగుతుందని అంత భావిస్తున్నారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొన్నటి వరకు రిలీజ్ ఫై పలు అనుమానాలు ఉండగా..మేకర్స్ మాత్రం సినిమాను ఫిబ్రవరి 25 న తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో ఏపీ సర్కార్ త్వరగా టికెట్ ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటే ఎంతో బాగుంటుందని ఏపీ డిస్ట్రబ్యూటర్లు కోరుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All