శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై వరుస క్రేజీ చిత్రాల్ని నిర్మిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ప్రస్తుతం ఆయన పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్`ని తెలుగులో బోనీకపూర్తో కలిసి `వకీల్సాబ్` పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మే 15న రిలీజ్చేయాలని ప్లాన్ చేశారు కానీ కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్న నేపథ్యంలో రిలీజ్ని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ఇదిలా వుంటే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొని వున్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ యుద్దం చేస్తున్నాయి. మన దేశంలో దీని ప్రభావం చిన్న చిన్నగా మొదలవుతోంది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ వైరస్ పాకిపోయింది. ఈ వైరస్ని అరికట్టాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి.
ఈ పోరాటంలో తమ వంతు బాధ్యతగా సినీ సెలబ్రిటీస్ ముందుకొచ్చి విరాళాలని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నితిన్, పవన్కల్యాణ్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాజాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ 20 లక్షలు విరాళం ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ విపత్తు ఏర్పడింది. దీని నివారణ చర్యల కోసం తమ వంతుగా 20 లక్షలు ప్రకటిస్తున్నామని, కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్ని అభినందిస్తున్నాం` అని దిల్ రాజు, శిరీష్ వెల్లడించారు.
We want to do our bit in this time of crisis. You can all save the world sitting at home. Please be responsible and safe!@TelanganaCMO @AndhraPradeshCM #IndiaFightsCorona#StayHomeStaySafe pic.twitter.com/vfxfS5lotu
— Sri Venkateswara Creations (@SVC_official) March 26, 2020
Credit: Twitter