పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ మూవీస్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరికొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు తో పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర విశేషాలు బయటకు వస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచుతుంది.
తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ కు గాను అమితాబ్ తన వాయిస్ ఓవర్ను అందించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాధా కృష్ణ, హీరోయిన్ పూజా హెగ్డే తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘ఆయన తన నెరేషన్తో ఎపిక్ లవ్ స్టోరిని మరింత ఎపిక్గా మార్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ ‘రాధే శ్యామ్’ టీమ్ బిగ్ బికి థాంక్స్ చెప్పింది.
ప్రస్తుతం ప్రభాస్, అమితాబ్ కలిసి Project K సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ప్రభాస్..అమితాబ్ను రిక్వెస్ట్ చేయడం..బిగ్ బి హిందీ వర్షన్ కు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరి ‘రాధే శ్యామ్’. గోపీకృష్ణా మూవీస్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్ఫణలో యువీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Thank you Shahenshah @SrBachchan sir for the Hindi voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/xrqZWGXoj1
— Radha Krishna Kumar (@director_radhaa) February 22, 2022