Homeగాసిప్స్ప్ర‌భాస్ 21కు అమితాబ్ పారితోషికం ఫిక్స‌యిందా?

ప్ర‌భాస్ 21కు అమితాబ్ పారితోషికం ఫిక్స‌యిందా?

ప్ర‌భాస్ 21కు అమితాబ్ పారితోషికం ఫిక్స‌యిందా?
ప్ర‌భాస్ 21కు అమితాబ్ పారితోషికం ఫిక్స‌యిందా?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ తెలుగులో `సైరా న‌ర‌సింహారెడ్డి` త‌రువాత మ‌రో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌బోతున్నారు. `మ‌హాన‌టి` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు జాతీయ స్థాయిలో పుర‌స్కారాన్ని అందించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ 50వ వ‌సంతంలోకి ఎంట‌ర‌వుతున్న నేప‌థ్యంలో ఈ మూవీని నిర్మాత అశ్వ‌నీద‌త్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు.

సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో తెర‌పైకిరానున్న ఈ మూవీకి సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సింగీతం శ్రీ‌నివాస‌రావు మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా ప‌దుకునే న‌టించ‌బోతోంది. మ‌రో కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ క‌నిపించ‌బోతున్నారు. ఈ మూవీ కోసం దీపిక 20 కోట్లు తీసుకుంటుండ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ 25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నార‌ని, ఆయ‌న‌ది అతిథి పాత్ర అని వార్త‌లు వినిపించాయి.

- Advertisement -

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బిగ్‌బిది అతిథి పాత్ర కాద‌ని, క‌థ‌కు అత్యంత కీల‌క‌మైన పాత్ర అని ఇందు కోసం ఆయన 21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నార‌ని తాజాగా బాలీవుడ్ మీడియా క‌థ‌నం. వ‌ర్కింగ్ డేస్ త‌క్కువ కాబ‌ట్టి బిగ్‌బి ఈ మొత్తానికి అంగీక‌రించిన‌ట్టు చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించి పారితోషికాల‌కే నిర్మాత దాదాపు 200 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. వ‌చ్చే ఏడాది ప్రారంభః కానున్న ఈ చిత్రాన్ని 2022లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All