యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ త్వరలో తెరపైకి రానున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ 50వ వసంతంలోకి ఎంటరవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం బాలీవుడ్ దివ దీపికా పదుకునేని ప్రభాస్కి జోడీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్స్టార్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ని ఒప్పించారు. ఈ విషయాన్ని ఇటీవల చిత్ర బృందం అఫీషియల్గా ప్రకటించింది. బిగ్బీతో కలిసి నటించాలన్న తన చిరకాల కోరిక ఈ మూవీతో తీరుతోందని ప్రభాస్ వెల్లడించారు కూడా. ఇదిలా వుంటే `ఆదిత్య 369` కు మించి సైంటిఫిక్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారట.
ఈ మూవీ కోసం అమితాబ్ని అసోసియేట్ చేసిన టీమ్ ఆయనకు పారితోషికంగా ఎంత ఇస్తున్నారన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మూవీ కోసం దీపికా పదుకునే 20 కోట్లు తీసుకుంటుండగా 25 నిమిషాల కీలక అతిథి పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ 25 కోట్లు తీసుకుంటున్నారట. బచ్చన్ కు నార్త్ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్గా మంచి మార్కెట్ వున్న విషయం తెలిసిందే. అది ఈ మూవీకి ప్లస్గా మారుతుందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2022లో రిలీజ్ చేయనున్నారట.