![`నాట్యం`కు సపోర్ట్గా నిలిచిన ఎన్టీఆర్! `నాట్యం`కు సపోర్ట్గా నిలిచిన ఎన్టీఆర్!](https://telugu.tollywood.net/wp-content/uploads/2021/02/Sandhya-Raju-Natyam-teaser-released.jpg)
కూచిపూడి డ్యాన్సర్, నటి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `నాట్యం`. నిశ్రింకల ఫిలింస్ బ్యానర్పై రేవంత్ కోరుకొండ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఓ నాట్య కళాకారిణి కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్ కామరాజు, రోహిత్ బెహెల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భాను ప్రియ, బేబీ దీవా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్ని హీరో యంగ్టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నటి సంధ్యా రాజుకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. ఓ నాట్య కళాకారిణి తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు కోరుకొండ రేవంత్ రూపొందించారు.
`ఒక కథను వింటాం కదా.. అదే కథను కళ్లకు చూపిస్తే దాన్నే నాట్యం అంటాం. నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం` అంటూ ఆదిత్య మీనన్ చెబుతున్న డైలాగ్లతో ఈ మూవీ టీజర్ మొదలైంది. `మరే కథ చేస్తున్నావ్ అని ఓ పాప ప్రశ్నిస్తే `కాదంబరి కథ` అంటూ ఆదిత్య మీనన్ చెప్పడం.. సంధ్యా రాజు నాట్య భంగిమల్లో కనిపించడం ఆకట్టుకుంటోంది.
Wishing the renowned dancer Smt @SandhyaRaju garu and the team of #Natyam the very best. Here’s the teaser https://t.co/dshzfZlMIE
@RevanthOfficial @NatyamTheMovie
— Jr NTR (@tarak9999) February 10, 2021
![YouTube video](https://i.ytimg.com/vi/pc-WjreEQRo/hqdefault.jpg)