ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యా రాజును నటిగా పరిచయం చేస్తూ నిశ్రింకల ఫిలింస్ బ్యానర్పై రేవంత్ కోరుకొండ తెరకెక్కిస్తున్న చిత్రం `నాట్యం`. నాట్యం ప్రధాన అంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కమల్ కామరాజు, రోహిత్ బెహెల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, బేబీ దీవానా నటిస్తున్నారు.
సరికొత్త నేపథ్యంలో ఓ నర్తకి కథగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని స్టార్ హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో నటి సంధ్యా రాజు నటరాజ విగ్రహం ముందు నాట్య మమూరిలా నాట్యం చేస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది.
సినిమాలో ఆమె నాట్య మయూరిగా కనిపించబోతున్నారు.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ రచన, ఎడిటింగ్, కెమెరాతో పాటు దర్శకత్వం బాధ్యతల్ని కూడా నిర్వర్తిస్తున్నారు. నిశ్రింకల ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Here’s Introducing my dear friend
Sandhya Raju’s
‘ First Look Motion Poster ‘
from her upcoming Debut Telugu Feature Film titled
‘Natyam’ ?
Directed by Revanth Korukonda @sandhyaraju @RevanthOfficial@NatyamTheMovie #sandhyaraju #revanthkorukonda#natyamthemovie pic.twitter.com/Irj1LPQNWT— Upasana Konidela (@upasanakonidela) January 23, 2021