వరుస హిట్లతో యమ క్రేజ్ని సొంతం చేసుకుంది కన్నడ భామ రష్మిక మందన్న. ఈ సంక్రాంతికి మహేష్తో కలిసి నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుని ఈ ఏడాది శుభారంభాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం కన్నడలో `పొగరు`, తమిళంలో `సుల్తాన్` చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ రష్మిక హీరోయిన్గా ఫిక్సయింది.
ఇటీవలే రష్మిక పై దర్శకుడు సుకుమార్ లుక్ టెస్ట్ని కూడా పూర్తి చేశాడు. సినిమాలో రష్మిక పాత్ర పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుందని తెలిసింది. నల్లమల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యలో కొన్నేళ్ల క్రియం తమిళ కూలీలు చాలా మంది నీటి గుంటల్లో శవాలుగా తేలారు. దీని వెనక పెద్ద మిస్టరీనే వుందని అప్పట్లో వరుస కథనాలు కూడా వినిపించాయి. ఆ అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయట. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నారు.
అయితే ఈ మూవీ షూటింగ్ గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` రిలీజ్ తరువాత రెస్ట్ తీసుకోవడంతో ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఈ నెల 15 నుంచి నల్లమల అడవుల్లో మొదలుపెట్టాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. అయితే అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ని వాయిదా వేశారు. ఈ పదిహేను రోజులు రష్మిక డేట్స్ ఆవిరైపోయినట్టే అని చెబుతున్నారు. మళ్లీ డేట్స్ కేటాయించక తప్పని పరిస్థితి. ప్రకృతి విలయం కాబట్టి చిత్ర నిర్మాతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కావడంతో రష్మిక మళ్లీ డేట్స్ కేటాయించబోతోందట.