Homeటాప్ స్టోరీస్సినీ పెద్దలపై నిప్పులు చెరిగిన 30 ఇయర్స్ పృథ్వీ

సినీ పెద్దలపై నిప్పులు చెరిగిన 30 ఇయర్స్ పృథ్వీ

30 ఇయర్స్ పృథ్వీ సినీ పెద్దలపై నిప్పులు చెరిగాడు . నేరుగా చిరంజీవి , అల్లు అరవింద్ , రాఘవేంద్రరావు , సురేష్ బాబు లపై విమర్శలు చేసి సంచలనం సృష్టించాడు పృథ్వీ . చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఫ్లవర్ బొకేలు పట్టుకొని మరీ ఫ్లయిట్ లో విజయవాడ వెళ్లి మరీ కలిసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయినా స్పందించడం లేదు ఎందుకో ! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు .

- Advertisement -

ఒక్కో వ్యక్తి పేరు ఉదహరిస్తూ విమర్శలు చేసాడు పృథ్వీ . చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీ కి వచ్చానని , నన్ను ఇబ్బంది పెట్టాలని చాలామంది చూసారని …… ఇప్పటికి కూడా అవకాశాలు రాకుండా చేస్తున్న వాళ్ళు తెలుసనీ సంచలన వ్యాఖ్యలు చేసాడు పృథ్వీ . ఇతడి బాధ ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే క్యూ కట్టిన పెద్దలు జగన్ ని మాత్రం అభినందించడానికి ముందుకు రావడం లేదు ఎందుకు ? అని నిలదీస్తున్నాడు . అయితే ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు మాత్రం అంతగా స్పందించడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All