Homeటాప్ స్టోరీస్మరో బిజినెస్ మొదలు పెట్టిన చిరంజీవి

మరో బిజినెస్ మొదలు పెట్టిన చిరంజీవి

Chiranjeevi New Business
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మరో బిజినెస్ మొదలు పెట్టాడు . ఇన్నాళ్లు సినిమాల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టిన చిరు ఆ తర్వాత భూములపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు అలాగే పూల తోటలపై కూడా . ఇక ఇప్పుడేమో విద్యారంగంలో అడుగుపెట్టాడు . చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో మొదటగా శ్రీకాకుళం జిల్లా లో ప్రారంభిస్తున్నాడు . అత్యుత్తమైన విద్యాబోధన లక్ష్యంగా ఈ స్కూల్ లను ఏర్పాటు చేస్తున్నాడట చిరు .

శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూసి ఆ తర్వాత తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో చాలా చోట్ల చిరంజీవి స్కూల్స్ ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నాడట . విద్యారంగం ఈరోజుల్లో భారీ లాభాలను తెచ్చిపెడుతున్న విషయం తెలిసిందే . అయితే నేను మాత్రం సేవా భావంతోనే చేస్తున్నాను అని అంటున్నాడు చిరు . ఇక ఈ పాఠశాలలో మెగా అభిమానుల పిల్లలకు రాయితీలు ఇవ్వనున్నారట . ఇక సినిమా విషయానికి వస్తే చిరంజీవి తాజాగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది . అక్టోబర్ లో సైరా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All