Homeటాప్ స్టోరీస్కూకట్ పల్లి లో లక్ష మెజారిటీతో గెలుస్తున్న సుహాసిని

కూకట్ పల్లి లో లక్ష మెజారిటీతో గెలుస్తున్న సుహాసిని

Positive wave for Nandamuri Suhasini in Kukatpallyకూకట్ పల్లి లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని సుమారు లక్ష మెజారిటీ తో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . నాన్న నందమూరి హరికృష్ణ మరణంతో దిగాలు పడిన సుహాసిని కి తమ్ముళ్లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కూడా హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఓటర్లు , సీమాంధ్రులు పెద్ద ఎత్తున సుహాసిని కి అండగా నిలబడుతున్నారు . నాయకులు సుహాసిని కి అండగా లేకపోయినప్పటికీ ప్రజలు , ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ సుహాసినికే మా ఓటు అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు .

అన్నగారి మనవరాలు కాబట్టి ఆమెని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు . అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సుహాసిని కి మద్దతుగా ప్రచారం చేయడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది . చాలామంది బహిరంగంగానే సుహాసిని కి మద్దతు ప్రకటిస్తూ మా ఓటు మీకే అని చెబుతున్నారు , ఆశీర్వదిస్తున్నారు . కూకట్ పల్లి లో సీమాంధ్రులు ఎక్కువ అలాగే తెలంగాణ వాళ్ళు సైతం నందమూరి సుహాసిని కే మా ఓటు అంటూ స్పష్టం చేస్తున్నారు . దాంతో లక్ష కు పైగా మెజారిటీతో నందమూరి సుహాసిని గెలవడం ఖాయమైపోయింది .

- Advertisement -

English Title: Positive wave for Nandamuri Suhasini in Kukatpally

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All