కూకట్ పల్లి లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని సుమారు లక్ష మెజారిటీ తో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . నాన్న నందమూరి హరికృష్ణ మరణంతో దిగాలు పడిన సుహాసిని కి తమ్ముళ్లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కూడా హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఓటర్లు , సీమాంధ్రులు పెద్ద ఎత్తున సుహాసిని కి అండగా నిలబడుతున్నారు . నాయకులు సుహాసిని కి అండగా లేకపోయినప్పటికీ ప్రజలు , ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ సుహాసినికే మా ఓటు అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు .
అన్నగారి మనవరాలు కాబట్టి ఆమెని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు . అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సుహాసిని కి మద్దతుగా ప్రచారం చేయడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది . చాలామంది బహిరంగంగానే సుహాసిని కి మద్దతు ప్రకటిస్తూ మా ఓటు మీకే అని చెబుతున్నారు , ఆశీర్వదిస్తున్నారు . కూకట్ పల్లి లో సీమాంధ్రులు ఎక్కువ అలాగే తెలంగాణ వాళ్ళు సైతం నందమూరి సుహాసిని కే మా ఓటు అంటూ స్పష్టం చేస్తున్నారు . దాంతో లక్ష కు పైగా మెజారిటీతో నందమూరి సుహాసిని గెలవడం ఖాయమైపోయింది .
English Title: Positive wave for Nandamuri Suhasini in Kukatpally