Homeటాప్ స్టోరీస్సుహాసిని తరుపున ప్రచారం చేస్తున్న కేసీఆర్ అన్న కూతురు

సుహాసిని తరుపున ప్రచారం చేస్తున్న కేసీఆర్ అన్న కూతురు

Kalvakuntla Ramya campaigns for Nandamuri Suhasiniకూకట్ పల్లి లో నందమూరి సుహాసిని తరుపున ప్రచారం చేస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి అన్న కూతురు కల్వకుంట్ల రమ్య . కేసీఆర్ తో మొదటి నుండి రాజకీయంగా విభేదిస్తోంది కల్వకుంట్ల రమ్య . కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లు కొనసాగిన రమ్య తాజాగా తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తోంది . కేసీఆర్ సోదరుడి కూతురు స్వయంగా ప్రచారంలో పాల్గొనడమే కాకుండా కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుండటంతో కూకట్ పల్లి ఏరియాలో స్పందన బాగా వస్తోంది . అసలే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అందునా కేసీఆర్ ని బాగా తిడుతుండటంతో రమ్య ప్రచారానికి స్పందన అనూహ్యంగా లభిస్తోంది .

కూకట్ పల్లి నియోజకవర్గం లో ఇప్పటికే నందమూరి సుహాసిని గెలుపు నల్లేరు మీద నడకలా అయ్యింది . అయితే ఇప్పుడు మెజారిటీ కోసం టిడిపి శ్రేణులు పోరాడుతున్నారు వాళ్లకు కల్వకుంట్ల రమ్య తోడు కావడంతో మరింత జోష్ వచ్చింది నాయకుల్లో . చంద్రబాబుని కూడా కలిసి వచ్చిన రమ్య తెలుగుదేశం పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తానని , కేసీఆర్ పాలనను అంతం చేయడమే మా లక్ష్యం అంటూ దూసుకుపోతోంది రమ్య .

- Advertisement -

English Title: Kalvakuntla Ramya campaigns for Nandamuri Suhasini

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All