కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని తరుపున ప్రచారం చేస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి అన్న కూతురు కల్వకుంట్ల రమ్య . కేసీఆర్ తో మొదటి నుండి రాజకీయంగా విభేదిస్తోంది కల్వకుంట్ల రమ్య . కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లు కొనసాగిన రమ్య తాజాగా తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తోంది . కేసీఆర్ సోదరుడి కూతురు స్వయంగా ప్రచారంలో పాల్గొనడమే కాకుండా కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుండటంతో కూకట్ పల్లి ఏరియాలో స్పందన బాగా వస్తోంది . అసలే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అందునా కేసీఆర్ ని బాగా తిడుతుండటంతో రమ్య ప్రచారానికి స్పందన అనూహ్యంగా లభిస్తోంది .
కూకట్ పల్లి నియోజకవర్గం లో ఇప్పటికే నందమూరి సుహాసిని గెలుపు నల్లేరు మీద నడకలా అయ్యింది . అయితే ఇప్పుడు మెజారిటీ కోసం టిడిపి శ్రేణులు పోరాడుతున్నారు వాళ్లకు కల్వకుంట్ల రమ్య తోడు కావడంతో మరింత జోష్ వచ్చింది నాయకుల్లో . చంద్రబాబుని కూడా కలిసి వచ్చిన రమ్య తెలుగుదేశం పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తానని , కేసీఆర్ పాలనను అంతం చేయడమే మా లక్ష్యం అంటూ దూసుకుపోతోంది రమ్య .
English Title: Kalvakuntla Ramya campaigns for Nandamuri Suhasini