సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గరి నుంచి ప్రపంచం కు గ్రామంగా మారుతుందన్నారు కానీ యావత్ ప్రపంచం మానవత్వాన్ని మర్చిపోతోంది. విదేశీ సంస్కృతిని పిచ్చిగా ఫాలో అవుతున్న నేటి యువత విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. సైకోల్లా బిహేవ్ చేస్తున్నారు. ఇందుకు ఫ్యాన్స్ ముసుగులో కొంత మంది చేస్తున్న వికృత చేష్టలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఓ హీరోయిన్నే ఏకంగా పచ్చిగా తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మీరా చోప్రా. పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన సూపర్హిట్ చిత్రం `బంగారం` ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మీరా చోప్రా. ఆ తరువాత తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా పెద్దగా రాణించలేకపోయింది. ఆ తరువాత బాలీవుడ్ చెక్కేసి అక్కడా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం ఢిల్లీలో వుంటోంది.
ఇటీవల తన తండ్రిని కొంత మంది పోకిరీలు కత్తితో బెదిరించారంటూ ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రికి, నగర పోలీస్ కమీషనర్కి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాపై బూతు పురాణం చదువుతున్నారు. రాత్రికి నీరేటెంతని అసభ్య పదజాలంతో తిడుతుండటం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇటీవల ఇన్స్టా లైవ్లో పాల్గొన్న మీరా చోప్రాని ఎన్టీఆర్ ఫ్యాన్ తమ హీరో గురించి చెప్పమని అడిగితే టక్కున తనెవరో తనకు తెలియదని చెప్పడంతో తాజా వివాదం రాజుకుంది. విమర్శలు హద్దులు దాటడంతో సీరియస్గా తీసుకున్న మీరాచోప్రా హైదరాబాద్ సిటీ పోలీస్తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.