స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధలని ఉల్లంఘించకుండా ఇంటి వద్దే నివాళులు అర్పించారు ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్రామ్. అయితే హీరో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ `తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలి. విప్లవాత్మకమైన పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారు.
ఇక లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమలో కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై కూడా బాలయ్య స్పందించారు. సినీ పరిశ్రమ పునః ప్రారంభంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. జూన్ రెండవ వారం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం వుందని, చిత్రీకరణ తుది దశకు వచ్చిన సినిమాలకు ముందు అవకాశం ఇవ్వాలని తాను సూచించినట్టు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి జీవో వచ్చాక చిత్రీకరణలు ప్రారఃభం అవుతాయని ఈ సందర్భంగా బాలకృష్ణ స్పష్టం చేశారు.