నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలయ్యల కాంబినేషన్లో రానున్న మూడవ చిత్రమిది. ఇందులో బాలకృష్ణ తొలిసారి అఘోరగా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాల్ని షూట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగభరిత సీన్లని పూర్తి చేశామని దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. అయితే తాజాగా ఈ త్రంలో `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తాను బాలయ్య చిత్రంలో నటించడం లేదని హీరో నవీన్ పొలిశెట్టి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న `జాతి రత్నాలు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.