న్యాచురల్ స్టార్ నాని తన 29వ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చాడు. ముందుగానే దసరాకు తన తర్వాతి చిత్రాన్ని అనౌన్స్ చేస్తానని నాని చెప్పిన విషయం తెల్సిందే. నాని నటించిన టక్ జగదీష్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇది తన 26వ చిత్రం. 27వ చిత్రం శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేసాడు నాని. సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా రాహుల్ సంకిట్ర్యాన్ దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం నాని తన 28వ చిత్రం అంటే సుందరానికి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకునే లోపే మరో చిత్రాన్ని మొదలుపెట్టడం నాని స్టైల్. అలాగే అంటే సుందరానికి ప్రొడక్షన్ దశలో ఉండగా తన 29వ చిత్రాన్ని సెట్ చేసాడు.
అక్టోబర్ 15 మధ్యాహ్నం 1 గంట 53 నిమిషాలకు నాని 29కు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు. సుకుమార్ వద్ద అసోసియేట్ గా పనిచేసాడు ఇతను. ఎస్ఎల్వి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాని తొలిసారి తెలంగాణ యాసను మాట్లాడనున్నాడు.
— Nani (@NameisNani) October 13, 2021