యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అవమానించాడు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు . అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదని, అతడి సినిమాలు కూడా నేను ఇంతవరకు చూడలేదని, అలాంటిది తెలుగుదేశం పార్టీ ని అతడికి అప్పగించాలని నేనెలా అంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు నాదెండ్ల భాస్కర్ రావు . తెలుగునాట స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ దశాబ్దానికి పైగా స్టార్ గా చెలామణి అవుతున్నాడు .
అలాంటి ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అని కామెంట్ చేయడం అంటే ఎన్టీఆర్ ని ఘోరంగా అవమానించినట్లే ! తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో నాయకత్వ మార్పు గురించి పెద్దగా చర్చ సాగుతోంది . దాంతో తెలుగుదేశం పార్టీ ని నందమూరి కుటుంబ సభ్యులు సొంతం చేసుకుంటారా ? లేదా ? అన్నది వాళ్ళ నిర్ణయమని , ఇక నా కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన లోచేరి పెద్ద తప్పు చేసాడని అంటున్నాడు . ఈ సీనియర్ లీడర్ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మాత్రం విపరీతంగా బాధపెట్టేవే !