Homeటాప్ స్టోరీస్జూనియర్ ఎన్టీఆర్ ని వివాదంలోకి లాగుతున్నారు

జూనియర్ ఎన్టీఆర్ ని వివాదంలోకి లాగుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయ్యాయి , తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది దాంతో కొంతమందికి కావాల్సినంత పని దొరికింది నందమూరి – నారా కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి . ఇక ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ . ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ని పలుమార్లు వివాదంలోకి లాగడానికి ప్రయత్నించిన వర్మ తాజాగా మరోసారి ఎన్టీఆర్ పై ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు .

- Advertisement -

తాతకు తగ్గ వారసుడుగా రాణించాలంటే తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టు లేకపోతే తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవడం ఖాయం అంటూ జూనియర్ ని రెచ్చగొడుతున్నాడు . మామయ్య వెన్నుపోటు బాబాయ్ ముందుపోటు తో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని , నువ్ టీడీపీ పగ్గాలు చేపడితే తెలుగుదేశం పార్టీని కాపాడవచ్చని లేదంటే పచ్చ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని అంటున్నాడు . అంటే ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఎన్టీఆర్ ని వివాదం లోకి లాగుదామనే భావిస్తున్నాడు వర్మ . ఉన్నపలంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు నాకు ఇవ్వంటే చంద్రబాబు ఇస్తాడా ఏంటి ? లోకేష్ బాబు ఏమంటాడు ? బాలయ్య బాబాయ్ ఏమంటాడు ?ఎలా రియాక్ట్ అవుతారో ? ఎంత పెద్ద తతంగం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All