ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు ప్రధాన పాత్ర పోషించిన నాట్యం ట్రైలర్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ను లాంచ్ చేసారు. అలాగే ఈ చిత్రానికి తన శుభాకాంక్షలు తెలియజేసారు. నాట్యం టైటిల్ కు తగ్గట్లుగానే డ్యాన్స్ బేస్డ్ డ్రామా. ఈ ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. డ్యాన్స్ తో ఈ సమాజంలో, ఆలోచనల్లో మార్పు తీసుకురాగలము అని నమ్మే ఒక కుటుంబం, దానికి అడ్డుపడే పరిస్థితులు, పెద్దలు… ఇలా రకరకాల అనుభవాలతో నాట్యం కథను రూపొందించినట్లు అర్ధమవుతోంది.
సంధ్య రాజు హీరోయిన్ గా నటించడంతో పాటు ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ కూడా. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా జరిగింది. అలాగే కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది సంధ్య రాజు. రేవంత్ కోరుకొండ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఆయన లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన కథ అని ప్రేక్షకులకు అన్ని విధాలా నచ్చుతుందని వ్యాఖ్యానించాడు.
ఈ చిత్రంలో కమల్ కామరాజు, ఆదిత్య మీనన్, రోహిత్ బెహల్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాట్యం చిత్రాన్ని ఇటీవలే సంధ్య రాజు బిగ్ బాస్ వేదికపై కూడా ప్రమోట్ చేసిన విషయం తెల్సిందే.