Homeటాప్ స్టోరీస్వాళ్ళ ఆశలన్నీవిజయ్ దేవరకొండ పైనే

వాళ్ళ ఆశలన్నీవిజయ్ దేవరకొండ పైనే

Mythri Movie Makers hopes on Vijay Devarakondaమైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రాలు ఈ ఏడాదిలో మూడు విడుదల కాగా రంగస్థలం పెద్ద హిట్ అయ్యింది , భారీగా లాభాలను తెచ్చిపెట్టింది అయితే మిగతా రెండు చిత్రాలు మాత్రం ఘోరంగా దెబ్బ కొట్టాయి . అందులో ఒకటి సవ్యసాచి కాగా మరొకటి అమర్ అక్బర్ ఆంటోనీ . అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రాన్ని చైతూ మార్కెట్ ని మించి ఖర్చు పెట్టి నిర్మించారు . తిరిగి 8 కోట్లు కూడా రాబట్టలేక పోయింది దాంతో 12 కోట్లకు పైగా నష్టం వచ్చింది దాంట్లో . ఆ తర్వాత రవితేజ హీరోగా నిర్మించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం కూడా ఘోర పరాజయం పొందింది . పట్టుమని 6 కోట్లు కూడా రాబట్టలేక పోయింది .

ఇక ఇప్పుడేమో మైత్రి మూవీ మేకర్స్ హిట్ చిత్రాల క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది దాంతో మామూలు చిత్రాలు కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి . ఇటీవలే టాక్సీ వాలా చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసాడు విజయ్ , దాంతో మైత్రి మూవీస్ ఆశలన్నీ విజయ్ దేవరకొండ పైనే ఉన్నాయి . గీత గోవిందం చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు , యావరేజ్ అనుకున్న టాక్సీ వాలా 30 కోట్లు వసూల్ చేయడంతో తప్పకుండా మమ్మల్ని ప్లాప్ ల నుండి గట్టెక్కించేది ఈ క్రేజీ హీరోనే అని ఆశ పెట్టుకున్నారట .

- Advertisement -

English Title: Mythri Movie Makers hopes on Vijay Devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All