రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ గా ఉండేది 218 కోట్ల గ్రాస్ వసూళ్లతో కానీ తమిళ స్టార్ హీరో విజయ్ సర్కార్ చిత్రంతో ఆ రికార్డ్ ని బద్దలు కొట్టేసాడు 225 కోట్ల గ్రాస్ వసూళ్లతో . చరణ్ నటించిన రంగస్థలం ఈ ఏడాది వేసవిలో మార్చి 30 న విడుదలై ప్రభంజనం సృష్టించింది . వంద రోజుల్లో 218 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచింది , అయితే తాజాగా విడుదలైన సర్కార్ చిత్రం కేవలం రెండు వారాల్లోనే 225 కోట్ల వసూళ్ళు సాధించి రంగస్థలం రికార్డ్ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్ దిశగా దూసుకుపోతోంది .
దీపావళి కానుకగా నవంబర్ 6 న విడుదలైన సర్కార్ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి . అయితే పలు వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టడంతో మరిన్ని వసూళ్లు పెరిగాయి . తెలుగులో కూడా పెట్టిన పెట్టుబడి అందరికీ వచ్చేసింది . ఇక తమిళనాట అయితే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది సర్కార్ చిత్రం . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది . మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తోంది దాంతో అవలీలగా 250 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .
English Title: Vijay ‘s Sarkar beats charan’s Rangasthalam records