మెగాస్టార్ చిరంజీవి వరసగా చిత్రాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు చిరంజీవి. ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది కూడా.
ఇంకా యువ దర్శకుడు వెంకీ కుడుములతో కూడా మెగాస్టార్ పనిచేస్తాడు. వీరిద్దరూ ఇటీవలే కలిసి ప్రాజెక్ట్ ను అధికారికంగా లాక్ చేసుకున్నారు. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న సినిమాలు పూర్తైన తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో చిత్ర షూటింగ్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఇదే కోవలో మారుతి దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. నిజానికి ఇద్దరూ కూడా ఇదే విషయమై పలుమార్లు కలుసుకున్నారు కూడా. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యాయి. అయితే మారుతి చెప్పిన ఐడియా నచ్చలేదో మరొకటో కారణం కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సెట్ అవ్వలేదని సమాచారం. మారుతి ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు మరో హీరోను వెతికే పనిలో ఉన్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
సక్సెస్ఫుల్ దర్శకుడికి ఓకే చెప్పిన మారుతి?
చిరంజీవి – కొరటాల శివ: రచ్చ మొదలైంది
చిరు అల్లుడి సినిమా కన్నడ వెళ్తోందే!
చిరుకి స్పందించాల్సిన అవసరమేమొచ్చింది