Homeన్యూస్చిరంజీవి భోళా శంకర్ కు ముహూర్తం కుదిరింది

చిరంజీవి భోళా శంకర్ కు ముహూర్తం కుదిరింది

చిరంజీవి భోళా శంకర్ కు ముహూర్తం కుదిరింది
చిరంజీవి భోళా శంకర్ కు ముహూర్తం కుదిరింది

మెగాస్టార్ చిరంజీవి స్పీడు పెంచాడు. తన నుండి సైరా, ఆచార్య సినిమాలకు బాగా జాప్యం కావడంతో ఈసారి అలా జరగకూడదని ప్లాన్ చేసాడు చిరంజీవి. వరసగా ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. చిరంజీవి ఎస్ చెప్పిన ప్రాజెక్ట్స్ మూడు ఉండగా అందులో రెండు రీమేక్స్ కావడం విశేషం. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ లూసిఫెర్ రీమేక్ ను గాడ్ ఫాదర్ పేరుతొ చిరంజీవి రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా చిరంజీవి చేతికి జరిగిన చిన్న శస్త్రచికిత్స కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక దీని తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ ను చేయాల్సి ఉంది. కాగా భోళా శంకర్ విషయంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ చిత్ర ఫైనల్ డ్రాఫ్ట్ పట్ల చిరంజీవి సంతృప్తిగా లేకపోవడంతో దాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడని. ఆ ప్రాజెక్ట్ స్థానంలో బాబీ చిత్రాన్ని ముందుగా పూర్తి చేస్తాడని రూమర్స్ వచ్చాయి.

- Advertisement -

అయితే వాటికి ఇప్పుడు చెక్ పెట్టారు. భోళా శంకర్ ఓపెనింగ్ కు ముహూర్తం కుదిరింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నారు. కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. అలాగే నవంబర్ 15 నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అధికారికంగా తెలియజేసారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్. క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All