Homeన్యూస్మేజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన అడివి శేష్

మేజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన అడివి శేష్

మేజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన అడివి శేష్
మేజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన అడివి శేష్

ఆసక్తికర సినిమాలతో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న చిత్రం మేజర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అటు కరోనా సెకండ్ వేవ్, ఇటు అడివి శేష్ కు డెంగ్యూ సోకడంతో మేజర్ షూటింగ్ లో జాప్యం జరిగింది. అయితే మొత్తానికి ఈ చిత్రం ట్రాక్ లో పడింది.

ఇక ఇప్పుడు మేజర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 11, 2022న మేజర్ విడుదల కానుంది. అంటే చిరంజీవి ఆచార్య విడుదలైన వారం రోజుల తర్వాత మేజర్ థియేటర్లలోకి వస్తుందన్నమాట. 26/11 అటాక్స్ లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

- Advertisement -

మేజర్ లో హీరోయిన్లుగా సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కిస్తుండగా సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మేజర్ చిత్రంపై అడివి శేష్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో నిర్మించగా మలయాళ భాషలో డబ్ చేయనున్నారు. మేజర్ కు సంబంధించిన ప్రమోషన్స్ త్వరలోనే షురూ కానున్నాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All