Homeన్యూస్మళ్ళీ రంగంలోకి దిగుతోన్న అడివి శేష్

మళ్ళీ రంగంలోకి దిగుతోన్న అడివి శేష్

మళ్ళీ రంగంలోకి దిగుతోన్న అడివి శేష్
మళ్ళీ రంగంలోకి దిగుతోన్న అడివి శేష్

యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే డెంగ్యూ జ్వరంతో తీవ్రంగా బాధపడిన విషయం తెల్సిందే. తన బ్లడ్ ప్లేట్ లెట్స్ పడిపోవడంతో అడివి శేష్ హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యాడు. అక్కడ కొన్ని రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ అయిన శేష్ ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగడానికి సన్నద్ధమవుతున్నాడు. తిరిగి షూటింగ్ కు వెళ్ళడానికి సమాయత్తమవుతోన్న అడివి శేష్, ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడు. తన మజిల్ ను తిరిగి పూర్వపు షేప్ కు తీసుకురావడానికి జిమ్ లో సన్నాహాలు చేస్తున్నాడు.

అడివి శేష్ మేజర్ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

మేజర్ తో పాటు హిట్ 2లో కూడా నటిస్తున్నాడు. ఈ స్పై థ్రిల్లర్ ను శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి అడివి శేష్ తన ఫెవరెట్ గూఢచారికు సీక్వెల్ ను మొదలుపెట్టాలని ఎదురుచూస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All