మహేష్బాబు ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజుతో కలిసి అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ కెరీర్లోనే రికార్డు స్థాయి వసూళ్లని సాధించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఈ సినిమా తరువాత రెట్టించిన ఉత్సాహంతో వున్న మహేష్ కొత్త సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `గీత గోవిందం` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ని లాక్ చేసిన పరశురామ్ ప్రీప్రొడక్షన్స్ కార్యక్రమాల్ని ప్రారంభించినట్టు తెలిసింది. ఓ అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని ఇటీవలే పరశురాం వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ నెల 31న సూపర్స్టార్ కష్ణ పుట్టిన రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఫార్మల్గా ప్రారంభించాలనుకుంటున్నారట. ఇదే రోజు ఫస్ట్లుక్తో పాటు టైటిల్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలిసింది. బడ్జెట్ లిమిట్స్తో ప్రయోగాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్తో కలిసి 14 ప్లస్ రీల్స్ కూడా నిర్మించనున్నాయట.